పరుగులు తీసిన బ్యాటరీ కార్లు | - | Sakshi
Sakshi News home page

పరుగులు తీసిన బ్యాటరీ కార్లు

Aug 8 2026 12:35 AM | Updated on Aug 8 2026 12:35 AM

అన్నవరం: స్థానిక వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, వికలాంగుల కోసం దాతలు సమకూర్చిన బ్యాటరీ కార్లు తిరిగి రత్నగిరిపై పరుగులు తీస్తున్నాయి. ఈ బ్యాటరీ కార్లు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై కొండ దిగువన గ్యారేజీలో ఉన్న వైనంపై ఈ నెల 5న ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్శన భారము నీదే స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి వెంటనే బ్యాటరీ కార్లకు మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే ఈ కార్లకు మరమ్మతులు చేయించి రత్నగిరికి తీసుకువచ్చారు. శుక్రవారం పశ్చిమ రాజగోపురం నుంచి స్వామివారి నిత్యాన్నదాన పథకం, సత్రాలకు వికలాంగులు, వృద్ధులను తీసుకువచ్చి మరలా రాజగోపురం వద్దకు దింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement