కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలో శ్రీమతి అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కథల పోటీ కరపత్రాన్ని శుక్రవారం సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు డాక్టర్ చల్లా రవికుమార్, డాక్టర్ చల్లా మెహర్ ప్రసన్న ఆవిష్కరించారు. పోటీల నిర్వహణ కథా రచయితలకు రచనా అవకాశాలను కల్పిస్తుందని వారన్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగర కృష్ణశ్రీ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15 లోపు ‘కుటుంబ విలువలు’ అనే అంశంపై రాసిన తమ కథలను పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 99631 63163 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.


