జనసేన కార్యకర్తల గుండాగిరీ | - | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్తల గుండాగిరీ

Mar 15 2025 12:34 AM | Updated on Mar 15 2025 10:20 AM

పిఠాపురం: చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు గుండాగిరీ చేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ట్రాఫిక్‌ నిలుపుచేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అడిగిన సామాన్య ప్రయాణికులపై జనసేన జెండా కర్రలతో దాడి చేసి, గాయపరిచారు. మమ్మల్నే అడుగుతారా? అధికారం మాది.. అడిగితే చంపుతామంటూ బెదిరించి, కర్రలతో దాడి చేయడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీనిని ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీసింది. మరోపక్క 216 జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు బైక్‌లపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపించారు. వారిని కనీసంగా కూడా నిలువరించకపోవడంతో పోలీసులపై ప్రయాణికులు దుమ్మెత్తి పోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement