వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. కాల్వల్లో చుక్క నీరు కనిపించడం లేదు. బోరుబావుల్లో సైతం నానాటికీ భూగర్భ జలమట్టం తగ్గుతోంది. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలకు ఎలాగైనా నీటి తడులు అందించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మానవపాడు
మండలం చెన్నిపాడు, గోకులపాడు తదితర గ్రామాల్లో రైతులు ఊట
కుంటల్లో విద్యుత్ మోటార్లు ఏర్పాటుచేసుకొని పైప్లైన్ ద్వారా పంటలకు నీరందిస్తున్నారు. బోరుబావుల్లో
నీటిమట్టం పూర్తిగా తగ్గిన రైతులకు ఊటనీరే ఆధారంగా మారింది.
పంటలకు సరిపడా నీరు అందించకపోవడంతో ఎండుముఖం పడుతున్నాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.
– మానవపాడు
చెన్నిపాడులో ఊటనీరు


