రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీనియర్ టోర్నీలో జిల్లా జట్టు విజేతగా నిలవాలని సీనియర్ సాఫ్ట్బాల్ క్రీడాకారుడు, జడ్చర్ల ఎస్ఐ అక్షయ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా పురుషుల సాఫ్ట్బాల్ జట్టు క్యాంప్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ నిరంతరం ప్రాక్టీస్తో క్రీడల్లో విజయం సాధించవచ్చని అన్నారు. టోర్నీలో చాంపియన్గా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ సంఘం సభ్యులు నాగరాజు, రాఘవేందర్, సీనియర్ క్రీడాకారుడు ఆది లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.


