
హిందూ ధర్మం కోసం పాటుపడాలి
ఎర్రవల్లి: హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడటం కోసం ప్రతి హిందువు పాటుపడాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్రావు అన్నారు. బుధవారం మండల పరిదిలోని బీచుపల్లిలో వివిద మండలాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై వీహెచ్పి నిర్వహిస్తున్న వివిధ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడంతో పాటుగా సేవ చేయడం కోసం 1964లో వీహెచ్పిని స్థాపించడం జరిగిందన్నారు. దీని ద్వారా 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్లో హిందువుల ప్రపంచ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాష్ట్రంలోని ప్రతి మండలంలో హిందూ సమాజం కోసం వీహెచ్పి పనిచేస్తూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుందని అన్నారు. హిందూ దేవాలయాల పుణరుద్ధరణ మరియు నిర్మాణం కోసం, మతమార్పిడితో పాటు గోహత్యలను అడ్డుకునేందుకు కృషిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ సత్యం, మదన్ మోహన్, నర్సింహా, వివిద మండలాలకు చెందిన ప్రముఖ్లు, సహ ప్రముఖ్లు, తదితరులు పాల్గొన్నారు.