జనగామ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రూ.లక్షల విలువ చేసే జనరేటర్ నిర్లక్ష్యానికి గురైంది. జనరేటర్ చుట్టూ పిచ్చి మొక్కలు, తీగజాతి మొక్కలు పెరిగి పూర్తిగా కమ్మేయడంతోపాటు పక్కనే ఉన్న ప్రహరీపైకి కూడా పాకాయి. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండిపోతూ జనరేటర్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీంతో విలువైన ప్రభుత్వ ఆస్తి పాడయ్యే ప్రమాదంతో పాటు, విద్యుత్ సంబంధిత ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జనరేటర్ను భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
– జనగామ


