జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది.. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది.. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది.. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది.. ఇలా కాళేశ్వరానికి వచ్చి న వారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నా రు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
– మరిన్ని ఫొటోలు: 10లోu


