
సర్కారు స్కూళ్లలోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్
జనగామ రూరల్: సర్కారు స్కూళ్లలోనే విద్యార్థుల కు బంగారు భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలి తాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కొడకండ్ల టీజీఆర్ఎస్–జేసీ విద్యార్థినులను గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థినులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్