ధాన్యం సేకరణ పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ పక్కాగా చేపట్టాలి

Mar 23 2025 9:03 AM | Updated on Mar 23 2025 9:00 AM

జనగామ రూరల్‌: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. రబీ ధాన్యం కొనుగోలుపై శనివారం కలెక్టరెట్‌లో అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 3,75,453 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, అందులో 2,35,954 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 62,013 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం, 1,73,941 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించనున్నట్లు తెలి పారు. ఈసారి జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణకు 119, దొడ్డు ధాన్యం సేకరణకు 181 సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యాన 134 కేంద్రాలు, ఐకేపీ 164, డీసీఎంఎస్‌ 2 కేటాయించామన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యం తీసుకువచ్చి ఎ–గ్రేడ్‌ రకం క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర పొందేలా రైతుల కు అవగాహన కల్పించాలని సూచించారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లించనున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, సివిల్‌ సప్లయీస్‌ డీఎం హతీరామ్‌, డీఏఓ రామారావునాయ క్‌, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ అధికారులు రాజేందర్‌రెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో

సదుపాయలు కల్పించాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement