జనగామ రూరల్: జిల్లాలో ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో అహల్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోనే యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు. ఇప్పటికై నా జిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకుపోయి పంటలు ఎండిన రైతులకు ఎకరాలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, రాపర్తి సోమయ్య బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, ఉపేందర్ బెల్లంకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి