నారాయణపూర్ ట్యాంక్ ముంపు కారణంగా కొన్ని ఇళ్లు ప్రభావితం అయ్యాయని, వారికి భూములు కేటాయించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సొంత భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
అసైన్డ్ భూముల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గంలో చాలా మంది పేదలకు భూములు లేవని, వెంటనే మంజూరు చేసేలా చూడాలన్నారు.


