
ప్రజావాణికి 40 అర్జీలు
జగిత్యాలటౌన్:కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 40మంది అర్జీలు పెట్టుకున్నారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ దరఖాస్తులు
స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీవో
రఘువరణ్, అధికారులు పాల్గొన్నారు.