
బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల అభివృద్ధి
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జగిత్యాల అభివృద్ధి చెందిందని, కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల, డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉచిత బస్ రవాణా తప్ప చేసిందేమీ లేదన్నారు. రైతుభరోసా ఇంకా రాలేదని, రుణమాఫీ కాలేదని, తులం బంగారం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని, మళ్లీ పాత రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయినా ఇప్పటికి గేట్లు కూడా బిగించలేకపోతున్నారని వివరించారు. 2018, 2023లో ఎమ్మెల్యేగా సంజయ్ని కష్టపడి గెలిపించుకుంటే ఇప్పుడాయన ఒకసారి సీఎంతో.. మరోసారి బీజేపీ ఎంపీ అర్వింద్తో ఫొటోల్లో కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి నిధులు తేవడంలో సంజయ్ విఫలమయ్యాడని, గ్రామగ్రామాన అతడిని నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పటిష్టతకు ప్రతి గ్రామంలో కమిటీలు వేయాలని, అందులో మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీ, బీసీలు ఉండాలన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మా ట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతిఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు, రాజేశంగౌడ్, లోక బాపురెడ్డి, శీలం ప్రియాంక, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
‘చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ ర జతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను కవిత ఆవిష్కరించారు. ఇది తెలంగాణ ప్రజల కు పండుగలాంటిదన్నారు. తెలంగాణ చౌక్ వద్ద వాల్రైటింగ్ చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాల ని రాశారు. సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన కాంగ్రెస్
ఆ పార్టీకి మోసం చేయడం మొదటి నుంచే అలవాటు
పార్టీ రజోతోత్సవ సభకు భారీగా తరలిరండి
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఎందుకు మారాడో తెలియదు
పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత