Masood Azhar: ఆపరేషన్‌ సిందూర్‌పై జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ ఓవరాక్షన్‌ | Masood Azhar letter on Operation Sindoor | Sakshi
Sakshi News home page

Masood Azhar: ఆపరేషన్‌ సిందూర్‌పై జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ ఓవరాక్షన్‌

May 7 2025 1:52 PM | Updated on May 7 2025 3:09 PM

Masood Azhar letter on Operation Sindoor

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌పై జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజహర్‌ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్‌ చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే మమ్మద్‌ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. నామ రూపాల్లేకుండా పోయింది.  ఇద్దరు మహిళా అధికారులు ఎవరీ కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు నాయకత్వం వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజహర్‌ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్‌ అజహార్‌ సోదరి,బావ,మేనల్లుడు సైతం ఉన్నారు. 

ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం

Advertisement
 
Advertisement
Advertisement