జాక్‌పాట్‌ తగిలింది.. లాటరీలో రూ.49కోట్లు సొంతం చేసుకున్నాడు | karanataka native wins Rs 49 crore jackpot in Abu Dhabi Big Ticket draw | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ తగిలింది.. లాటరీలో రూ.49కోట్లు సొంతం చేసుకున్నాడు

Feb 5 2026 10:00 PM | Updated on Feb 5 2026 10:16 PM

karanataka native wins Rs 49 crore jackpot in Abu Dhabi Big Ticket draw

అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటకకు చెందిన వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన రూ.49 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.  

అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంతను శెట్టిగర్‌ అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన టికెట్ నంబర్ ఎంపిక కావడంతో రూ.49 కోట్లను(AED 22 మిలియన్) సొంతం చేసుకున్నారు.

కర్ణాటకకు చెందిన శంతను గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తూ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అనుకోకుండా ఆయన టికెట్ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది.

విజయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు. ఇది మా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. ఈ డబ్బుతో కుటుంబానికి భద్రత కల్పిస్తాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం’అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.

1992లో అబుదాబి విమానాశ్రయంలో ప్రారంభమైన ఈ లాటరీ, గల్ఫ్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతి నెలా కోట్ల రూపాయల విలువైన జాక్‌పాట్‌తో పాటు లగ్జరీ కార్లు, ఇతర బహుమతులు అందజేస్తారు.గతంలో కూడా అనేక భారతీయులు ఈ లాటరీలో భారీ మొత్తాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఎక్కువగా పాల్గొంటారు.

ఈ విజయం కర్ణాటకలోని ఆయన గ్రామం ఉడిపికి గర్వకారణమైంది. స్థానికులు మన ప్రాంతం నుంచి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకోవడం గొప్ప విషయం  అని ఆనందం వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఇది ఒక ఆశాకిరణంలా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement