
ఇరాన్పై తాము చేసిన దాడులు హిరోషిమా-నాగసాకిలపై చేసిన దాడుల మాదిరిగా ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను ట్రంప్ వెనక్కి తీసుకోవాలని జపాన్ డిమాండ్ చేసింది.
అదొక దేశాల్ని నాశనం చేసిన విధ్వంసకర ఘటన అని, దాన్ని ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఎత్తి చూపడం దారుణమని జపాన్లోని నాగసాకికి చెందిన నేతలు మండిపడుతున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అణుబాంబులను, అణ్వాయుధ దాడులను సమర్ధించేలా ఉన్నాయని మండిపడ్డారు. నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడి ఎప్పటికీ మాసిపోని వ్యథ అని, మరి దాన్ని మళ్లీ ట్రంప్ ఎత్తిచూపడం ఏంటని ప్రశ్నించారు.
అదే సమయంలో ట్రంప్ వ్యాఖ్యలపై హిరోషిమాలో పెద్ద ఎత్తును నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హిరోషిమా శాసనసభ్యులు అణ్వాయుధాల వాడకాన్ని సమర్థించే ఏ ప్రకటననైనా తిరస్కరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఏ యుద్ధాలనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు,
జపాన్ కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగస్టు 6వ తేదీన అమెరికా అణుబాంబుకు గురైన ఈ నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరంగా నిలిచింది. అమెరికా అణుబాంబు దాడితో వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.