పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు.. | Czech Republic sends Indian suspect in plot to kill Sikh separatist to US | Sakshi
Sakshi News home page

పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు..

Jun 18 2024 5:51 AM | Updated on Jun 18 2024 5:51 AM

Czech Republic sends Indian suspect in plot to kill Sikh separatist to US

అమెరికాకు నిఖిల్‌ గుప్తా అప్పగింత 

వాషింగ్టన్‌: ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ గత వారం అమెరికాకు అప్పగించింది. 

గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద పౌరసత్వమున్న పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు నిఖిల్‌ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులిచి్చనట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్‌ రిపబ్లిక్‌లో ఉన్న నిఖిల్‌ను అక్కడి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్‌ చేసింది. అయితే, అమెరికా ఆరోపణలను భారత్‌ ఖండించింది. నిఖిల్‌ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఫెడరల్‌ మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement