చైనా హ్యాకర్లపై కేసు | Chinese and Malaysian hackers charged by US over attacks | Sakshi
Sakshi News home page

చైనా హ్యాకర్లపై కేసు

Sep 18 2020 5:30 AM | Updated on Sep 18 2020 5:56 AM

Chinese and Malaysian hackers charged by US over attacks - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని, పలు ఇతర దేశాల్లోని 100కి పైగా కంపెనీలు, సంస్థల వెబ్‌సైట్స్‌ను హ్యాక్‌ చేసి, సున్నితమైన, విలువైన సమాచారం తస్కరించారని ఆరోపిస్తూ ఐదుగురు చైనా పౌరులపై అమెరికా కేసు నమోదు చేసింది. వారు హ్యాక్‌ చేసిన వాటిలో భారత ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు వెబ్‌సైట్లు ఉన్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆ చైనా పౌరులకు ఇద్దరు మలేసియన్లు సహకరించారని అమెరికా డెప్యూటీ అటార్నీ జనరల్‌ జెఫ్రీ రోజెన్‌ బుధవారం వెల్లడించారు. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్‌ వీపీఎన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యేందుకు వారు వీపీఎస్‌ ప్రొవైడర్‌ సర్వర్లను ఉపయోగించుకున్నారు. భారత ప్రభుత్వ కంప్యూటర్లలో కోబాల్ట్‌ స్ట్రైక్‌ మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు’ అని డెప్యూటీ అటార్నీ జనరల్‌ జెఫ్రీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement