
బీజింగ్: చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ నర్సింగ్ హోమ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్లోని లాంగ్హువా కౌంటీలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ నర్సింగ్ హోమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో నర్సింగ్ హోమ్(ఆసుపత్రి)లో మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా జిన్హువా వెల్లడించింది. అలాగే, పలువురు తీవ్రంగా గాయపడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Deadly fire claims 20 lives at nursing home in northern China
The blaze struck a facility in Chengde City, with survivors relocated to a nearby hospital for treatment and observation, Xinhua News reports.#China pic.twitter.com/dOdt0UNX1w— MOCez🇷🇺🇮🇶🇾🇪🇨🇳🇵🇰🇵🇸🇱🇧🇮🇷🇰🇵☀️ (@Mousacisse1) April 9, 2025