మాదాపూర్: గ్రీన్బిల్డింగ్లు మౌళిక సదుపాయాలను నిర్మించడంలో సిమెంట్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ సి.శేఖర్రెడ్డి తెలిపారు. మాదాపూర్లోని గురువారం హెచ్ఐసీసీలో వార్షిక కాన్ఫరెన్స్ ఎక్స్పో గ్రీన్సిమెంటెక్ 22వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మన జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి తక్కువ కార్బన్ పదార్థాలను స్వీకరించడం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమ ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎక్కువగా స్వీకరించాలన్నారు. 50 మందికిపైగా ఎగ్జిబిటర్లతో ఎక్స్పో నిర్వహించారు.


