భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ | - | Sakshi
Sakshi News home page

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

Dec 12 2025 5:46 PM | Updated on Dec 12 2025 5:46 PM

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

ఉప్పల్‌: ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఫుట్‌బాల్‌ పోటీలో ప్రఖ్యాత ప్లేయర్‌ మెస్సీతోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటుండటంతో గురువారం డీజీపీ శివధర్‌ రెడ్డి,రాచకొండ సీపీ సుధీర్‌ బాబు సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, రవాణ సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌, డీజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement