జగన్నాథుడి రథయాత్ర సోమవారం నగరంలో కనుల పండువగా సాగింది. ములుగు రోడ్లోని ఇస్కాన్ దేవాలయంలో రథాన్ని కొబ్బరి మట్టలు, పూలదండలతో జగన్నాఽథ ఆలయం మాదిరిగా అలంకరించారు. రథంపై జగన్నాఽథ, సుభద్ర, బలరాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 2గంటలకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన రథయాత్ర హనుమకొండ చౌరస్తా, ఎంజీఎం ఆస్పత్రి, పోచమ్మ మైదాన్నుంచి ఎంజీఎం రోడ్డు మీదుగా శ్రీవేంకటేశ్వర గార్డెన్స్కు చేరుకుంది. భక్తులు నెయ్యితో దీపాలను స్వామివారికి నివేదించారు. కీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదవితరణ చేశారు. – హన్మకొండ కల్చరల్


