
30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : జిల్లా పికిల్ బాల్ అసోసియేషన్, ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా చీఫ్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 19 బాల బాలికలతోపాటు ఓపెన్ విభాగంలో 35+, 50+, 60+ పురుషులు, మహిళల విభాగాల్లోనూ పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను చిగురుపాటి రవీంద్ర బాబు, జీవీఎస్ ప్రసాద్, అరుణ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.