
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన గుంటూరు వైద్యుడు
హెల్త్ యూనివర్సిటీ టాపర్గా డాక్టర్ పవన్కుమార్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల న్యూరో సర్జరీ వైద్య విభాగం పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పోలిశెట్టి జానకీ రామ పవన్కుమార్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసిన పీజీ పరీక్షా ఫలితాల్లో న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 800 మార్కులకు 511 సాధించి డాక్టర్ పవన్కుమార్ వర్సిటీ టాపర్గా నిలిచాడు. కాకినాడకు చెందిన డాక్టర్ పవన్కుమార్ విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ పీజీ అభ్యసించారు. గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ పీజీ ఎంసీహెచ్ న్యూరాలజీలో చేరారు. న్యూరో సర్జరీ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉండగా, ఒకరు యూనివర్సిటీ టాపర్గా నిలవగా, మరొకరు డాక్టర్ యాదరాల కృష్ణుడు యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ సాధించారు. 800 మార్కులకు గాను 508 మార్కులు సాధించారు. పరీక్షా ఫలితాల్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ జానకీ రామ పవన్కుమార్, డాక్టర్ యాదరాల కృష్ణుడులను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.సత్యనారాయణమూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ గొల్లా రామకృష్ణ, తదితరులు అభినందించారు.