
గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి సెల్వరాజన్
బాపట్ల కలెక్టర్ కర్నూలుకు బదిలీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టర్గా 2012 బ్యాచ్కు చెందిన
నాగలక్ష్మి సెల్వరాజన్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం విజయనగరం కలెక్టర్గా పని చేస్తున్నారు. అంతకుముందు అనంతపురంలోనూ విధులు నిర్వర్తించారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేశారు. ప్రస్తుత కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన 2022లో జిల్లాల పునర్ విభజన తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో విశేషంగా కృషి చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కర్నూలు జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు.
లింగ నిర్ధారణ చట్టాన్ని అమలు చేయాలి
– జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి
గుంటూరు వెస్ట్ : గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన చట్టం జిల్లా స్థాయి అథారిటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు అయ్యే కొత్త, రెన్యూవల్ స్కానింగ్ సెంటర్లను తప్పనిసరిగా ప్రోగ్రామ్ అధికారులు తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 283 గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగు రెన్యూవల్ , 12 మోడిఫికేషన్, రెండు క్యాన్సిలేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తెనాలి డివిజన్లో 25 స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే ఎవరినీ ఉపేక్షించవద్దని కలెక్టర్ ఆదేశించారు.
28న మెగా జాబ్ మేళా
నెహ్రూనగర్ : సమర్ధనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 28వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మేళా ఉంటుంది. ఈ మేరకు సమర్ధనం రీజినల్ మేనేజర్ ఎంఆర్కే పరమహంస తెలిపారు. శనివారం అమరావతి రోడ్డులో మేళాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులల కోసం పనిచేస్తున్న సమర్ధనం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18– 35 ఏళ్ల వయసు కలిగి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన వారికోసం 30కి పైగా కంపెనీలు మేళాలో ఎంపికలు నిర్వహిస్తాయని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రెస్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకొని 28న నేరుగా హాజరు కావాలని కోరారు. వివరాలకు 63648 67800, 63648 67801, 63648 67802, 63648 67803 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
స్టూడెంట్ కిట్లను త్వరగా పంపిణీ చేయండి
డీఈవో పి.శైలజ
తెనాలి అర్బన్: స్టూడెంట్ కిట్స్ను త్వరగా పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి పి.శైలజ ఆదేశించారు. తెనాలి మండలం కొలకలూరు, నందివెలుగు, ఖాజీపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్స్ను శనివారం ఆమె పరిశీలించారు. కిట్స్ పంపిణీపై ఆరా తీశారు. అలాగే మధ్యాహ్నా భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంఈవో మేకల లక్ష్మీనారాయణ, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.

గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి సెల్వరాజన్