భారత్‌లో ‘మిస్‌ వరల్డ్-2024 ఈవెంట్‌, 28 ఏళ్ల తర్వాత | India To Host 71st Miss World Pageant After 28 Years | Sakshi
Sakshi News home page

71st Miss World Pageant భారత్‌లో ‘మిస్‌ వరల్డ్’ పోటీలు 28 ఏళ్ల తర్వాత

Jan 20 2024 10:42 AM | Updated on Jan 22 2024 11:35 AM

India To Host 71st Miss World Pageant After 28 Years - Sakshi

71వ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను భారత్‌ నిర్వహించనుంది. దాదాపు  మూడు దశాబ్దాల తర్వాత ఇలాంటి  వేడుక నిర్వహిస్తుండటంతో భారీ  ఆసక్తి నెలకొంది.

అందాల పోటీలకున్న  క్రేజే  అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల  తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా  ఆతిథ్యం ఇవ్వనుంది.  1996 తరువాత మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ జరగబోతోంది.  ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022  సినీ శెట్టి   మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.

ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు  ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ పోటీలను  అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా  ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని  హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC)  ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్‌ షురూ అవుతుంది. 

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో  జూలియా మోర్లీ స్వయంగా ఈ  విషయాన్ని మిస్ వరల్డ్  అధికారిక పేజీ ట్విటర్‌ పేజీలో  షేర్‌ చేశారు.  మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ  హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం  సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది. 2017లో మానుషి చిల్లార్‌  తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్  కిరీటాన్ని దక్కించుకోలేదు.

అందాల  రాణులుగా నిలిచిన  భారతీయ భామలు  ఎవరో తెలుసా?
రీటా ఫరియా - 1966
ఐశ్వర్యా రాయ్ - 1994
డయానా హేడెన్ - 1997
యుక్తా ముఖి - 1999
ప్రియాంకా చోప్రా - 2000
మానుషి చిల్లార్ - 2017

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement