నిధుల సమీకరణకు ఫ్యాషన్‌ షో.. | Glorious Ms And Mrs India & Royale Mr India 2025 At Hyderabad | Sakshi
Sakshi News home page

నిధుల సమీకరణకు ఫ్యాషన్‌ షో..

Apr 29 2025 10:27 AM | Updated on Apr 29 2025 10:36 AM

Glorious Ms And Mrs India & Royale Mr India 2025 At Hyderabad

గ్లోరియస్‌ మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా, రాయల్‌ మిస్టర్‌ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ సోమాజీగూడలోని ది పార్కు హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్స్‌ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. 

జేసీఐ సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ మద్దతులో ఎస్‌ఎస్‌కే క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో గ్లోరియస్‌ మిస్‌ అండ్‌ మిసెస్‌ ఇండియా, రాయల్‌ మిస్టర్‌ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్‌ అని పేర్కొన్నారు. 

ఉమంగ్‌ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్‌ చేసి ఆకట్టుకున్నారు.   

(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్‌ స్టోరీ ఇదే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement