The Park Hotel
-
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
హైదరాబాద్లో ‘హాక్ 2.0’కు కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్స్ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా ఉండగా తొలి హాక్–2023 సమ్మిట్ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024కు (హాక్ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.నగర పోలీసు విభాగం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్ హోటల్లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించాలని, సైబర్తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే నిర్ణయించారు.యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్ సమ్మిట్లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్ స్వ్కాడ్స్ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి.చదవండి: సైబర్ స్కామర్స్తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి.. -
హైదరాబాద్: హోటల్ ది పార్క్ లో కన్నులపండుగా మనోహర భారతీయ కళ ప్రదర్శన (ఫొటోలు)
-
షో హాట్..
-
టూరిస్టుల పట్ల దురుసు ప్రవర్తన