దెందులూరు: ప్రణాళికాబద్ధమైన నిరంతర సాధన, శిక్షణతోనే ఉన్నత విజయాలు సాధ్యపడతాయని గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సుభాషిని అన్నారు. అమరావతి కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపికవ్వడంతో మంగళవారం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన 8వ తరగతి విద్యార్థినులు ఎస్.సాయి కార్తిక, యు.హిమజ, లాంగ్ జంప్లో 10వ తరగతి విద్యార్థిని నాగ సింధుజ, వాలీబాల్లో 10వ తరగతి విద్యార్థిని ఎస్.రాజేశ్వరిలను హెచ్ఎం సుభాషిని అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు చిటికెన రమేష్, ఎండీ అమన్ సుల్తానా పాల్గొన్నారు.


