స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి నెలలో ఒకరోజు శుభ్రం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఏలూరు తంగెళ్లమూడిలో ఫిబ్రవరి 21న తమ్మిలేరు ఆనుకుని ఉన్న గట్టును సిబ్బంది శుభ్రం చేస్తే, నాయకులు అధికారులు వచ్చి రెండు మొక్కలు నాటి ఫొటో ఫోజు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో నాటేందుకు తీసుకు వచ్చిన వేలాది మొక్కలు ఇదిగో ఇలా వృథాగా పడి ఉన్నాయి. 10 రోజులు దాటినా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. కొన్ని మొక్కలను మూగజీవాలు తినిస్తే మరికొన్ని నీరు లేక ఎండిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు


