
జోరుగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం : పొంగుటూరు పంచాయతీ కన్నాయగూడెం ఊర చెరువులో మట్టి అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు అక్రమార్కులు జేసీబీలతో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల అండతో చట్టవిరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఊర చెరువులో పశువుల కోసం ఉంచిన తాగునీటిని కూడా ఇంజిన్లతో తోడి అక్రమార్కులు తమకు అనువుగా ర్యాంపులను నిర్మించి మట్టి తోలకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, అధికారుల సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడబ్ల్యుఏడి పరిధిలోని నందాల చెరువు, శ్రీరామ కట్టు, భీముని చెరువుల్లో రాత్రి వేళ రహస్యంగా తోలకాలు చేస్తున్నారు. తవ్వకాలు జరిపే వారి గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే జేసీబీలు, టిప్పర్లు మాయమవుతున్నాయి. తవ్వకాల వల్ల చెరువు ఆకారం మారిపోతూ, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
జెడ్పీలో పదోన్నతులు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ముగ్గురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఎంపీడీవోలుగా, సీనియర్ అసిస్టెంట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారికి ప్రమోషన్ ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో అందజేశారు.
బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా జగదీష్
ద్వారకాతిరుమల: టీటీడీ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా ద్వారకాతిరుమల విర్డ్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్, ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ గుడారు జగదీష్ నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీ ఈఓ శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ జగదీష్ గతంలో బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇదిలా ఉంటే గత నెల 2న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, టీటీడీ బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు ఆమోదం మేరకు ఈఓ శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. డాక్టర్ జగదీష్ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జి డైరెక్టర్గా కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు కొనసాగుతారు.
అన్న కొడుకుపై కత్తితో దాడి
పెంటపాడు: ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకై న నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

జోరుగా మట్టి అక్రమ రవాణా