వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల నియామకం

Apr 27 2025 12:53 AM | Updated on Apr 27 2025 12:53 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని

ముసునూరు : వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాల్లో రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శిగా గోపవరం ఎంపీటీసి, వైస్‌ ఎంపీపీ పాముల గంగాధర్‌ నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుకు ముఖ్య అనుచరుడుగా ఉన్న ఆయన్ను రాష్ట్ర స్థాయి ప్రచార వింగ్‌ పదవికి ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం గంగాధర్‌ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

కొయ్యలగూడెం నుంచి చిటికెన శ్రీనివాస్‌

కొయ్యలగూడెం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శిగా కొయ్యలగూడెంకి చెందిన చిటికెన శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా గౌడ సంఘం యాక్టివ్‌ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం చిటికెన విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కృషి చేస్తానని చిటికెన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

గణపవరం: వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉంగుటూరు నియోజకవర్గంలోని నలుగురు నాయకులకు రాష్ట్ర స్థాయిలో వివిధ అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో ఎలిశెట్టి పాపారావు బాబ్జి (ఉంగుటూరు)ను రాష్ట్ర బూత్‌కమిటీ వింగ్‌ కార్యదర్శిగా నియమించింది. ఇదే మండలానికి చెందిన మంద జయలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. నడింపల్లి సోమరాజు(గణపవరం)ను రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శిగా, భీమడోలు మండలానికి చెందిన కేతినీడి విశ్వేశ్వరరావును రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శిగా నియమించారు.

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం

ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తణుకు మండలం కానూరుకు చెందిన వీరమల్లు వెంకట్రావు రూ.5 లక్షలు, కాజా పడమరకు చెందిన గుబ్బల రామారావు రూ.లక్ష ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్‌ పత్రాలను అందించారు. అనంతరం వారికి స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని1
1/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని2
2/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని3
3/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శుల ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement