మువ్వన్నెల సంబరం ముందే వచ్చింది. ఉప్పలగుప్తం ఎంపీడీఓ డి.కృష్ణ ఆధ్వర్యాన గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ నుంచి గొల్లవిల్లి సెంటర్ వరకూ విద్యార్థులు మూడు రంగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి, దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్తి సత్యకృష్ణ, ప్రధానోపాధ్యాయిని జి.కనకదుర్గ, పీడీలు గొలకోటి ఫణీంద్ర, డి.సరస్వతి, పీఈటీ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
– ఉప్పలగుప్తం


