
ట్రిప్స్కు తృతీయ బహుమతి
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు తృతీయ బహుమతి లభించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీమిలే సూర్ సాంగ్ ప్రేక్షకులను అలరించింది. ఈ నృత్యానికి తృతీయ బహుమతి లభించగా, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతి అందుకున్నారు. ఆ విద్యార్థులను శనివారం ట్రిప్స్ చైర్మన్ బాలా త్రిపుర సుందరి, డైరెక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి అభినందించారు.