
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లజర్ల: మండలంలోని పుల్లలపాడు వద్ద బైపాస్ రోడ్డుపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసుదుర్గాప్రసాద్, బిరదాఅంజి, జాజుమొగ్గలసాయిచరణ్తేజ కలసి కాలినడకన ద్వారకాతిరుమల శనివారం సాయంత్రం వెళ్తుండగా మార్గమధ్యలో పుల్లలపాడు వద్ద రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బిరదా అంజి మృతిచెందగా, దుర్గాప్రసాద్, సాయిచరణ్ చికిత్స పొందుతున్నారు. మృతుడు అంజి మోటారు సైకిల్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.