
ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా రాజ్కుమార్
రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా కత్తుల రాజ్కుమార్ బుధవారం రాజమహేంద్రవరంలోని జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కరీంనగర్ జోన్ నుంచి పదోన్నతిపై ఇక్కడకు బదిలీపై వచ్చారు. రాజమహేంద్రవరం జోన్ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయం పరిధిలో రూ.10,037 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపారు.
తిరుమల విద్యాసంస్థల జయకేతనం
రాజమహేంద్రవరం రూరల్: తిరుమల ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఉప్పాల జశ్వంత్ పవన్, సీహెచ్ సుహ్రుత భరద్వాజ్, 596మార్కులు, దేవిరెడ్డి చైతన్య సహస్ర, చాగంటి లాస్ట హర్షిత, సారిక నందిని 595 మార్కులు, మేకా వంశిత, ఈడుపుగంటి దివ్యశ్రీ, బార సాత్విక, కూర్మాల తారకసాయి సూర్యఫణిశ్రీ వసంత్, లోట్ల హన్సుజ 594 మార్కులు చొప్పు సాధించారన్నారు. 590పైన 41 మంది, 580 పైన 326 మంది, 570 పైన 652 మంది, 560 పైన 900 మంది, 550 పైన 1078 మంది, 500 పైన 1,458 మంది విద్యార్థులు మార్కులు సాధించారన్నారు. అలాగే నూరుశాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ నున్న సరోజనీదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.

ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్గా రాజ్కుమార్