
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మామిడికుదురు: స్థానిక 216వ నంబర్ జాతీయ రహదారిపై గో ఫ్రెష్ ఎదురుగా వాహనం ఢీ కొని పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన బూల వెంకటరత్నం (34) శుక్రవారం మృతి చెందాడు. విద్యుత్ సామాన్ల కోసం హోండా యాక్టివ్పై మామిడికుదురు వచ్చి ప్రమాదానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదారాబాదులోని సీఎంఆర్లో పని చేస్తున్న వెంకటరత్నం మూడు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం ఉదయం స్వగ్రామం వచ్చి మృత్యువుపాలయ్యాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఏడేళ్ల క్రితం లక్ష్మీదుర్గతో అతడికి వివాహమైంది. అతనికి ఆరేళ్ల భరత్ శ్రీసాయి, రెండేళ్ల మాధురి లక్ష్మి సంతానం. వెంకటరత్నం మృతితో తాము జీవనాధారం కోల్పోయామని, ఇక తమకు దిక్కెవరంటూ అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. ఎస్సై చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.