ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి మృతి

Apr 19 2025 12:20 AM | Updated on Apr 19 2025 12:20 AM

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి మృతి

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేపూడి మృతి

కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ శుక్రవారం మరణించారు. 1994లో సమితి ఏర్పడిన తర్వాత 1995లో మందకృష్ణమాదిగ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కొండేపూడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి 30 ఏళ్ల పాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అనేకసార్లు జైలు జీవితాన్ని గడిపారు. కలెక్టరేట్‌ దగ్గర జరిగిన విధ్వంసం కేసులో 40 రోజులపా టు జైల్లో ఉన్నారు. తాళ్లరేవు తాహసీల్దార్‌ కార్యా లయం దహనం, రైల్‌రోకో సందర్భంగా గొల్లప్రోలులో రైళ్ల రాకపోకలను అడ్డగించిన కేసుల్లో నెలలు తరబడి జైల్లో ఉన్నారు. జిల్లాలోని మాదిగ సంఘాల నాయకులు శ్యాంబాబుకు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement