భర్తతో పోట్లాడి.. కాలువలో దూకింది | A Woman Ends Her Life In East Godavari District | Sakshi
Sakshi News home page

భర్తతో పోట్లాడి.. కాలువలో దూకింది

Sep 30 2023 12:16 AM | Updated on Sep 30 2023 10:18 AM

- - Sakshi

భర్తతో పోట్లాడిన ఓ యువతి పోలవరం కాలువలో దూకింది. పోలీసుల కథనం ప్రకారం..

తూర్పు గోదావరి: భర్తతో పోట్లాడిన ఓ యువతి పోలవరం కాలువలో దూకింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన నెరుసు శ్రీనివాసరావుకు, కొవ్వూరుకు చెందిన కస్తూరితో ఈ ఏడాది జనవరిలో వివాహమైంది. శ్రీనివాసరావు వేలివెన్ను శశి విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చి, తరచూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరిని కొన్ని రోజుల పాటు కొవ్వూరులోని పుట్టింట్లో ఉంచమని శ్రీనివాసరావు తల్లిదండ్రులు సూచించారు.

దీంతో ఆమెను శ్రీనివాసరావు బైక్‌పై తీసుకొని శుక్రవారం ఉదయం బయలుదేరాడు. అనంతపల్లి పోలవరం కుడి కాలువ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాలి చెప్పు పడిపోయిందని, బైక్‌ ఆపాలని కస్తూరి భర్తను కోరింది. బైక్‌ ఆపిన వెంటనే ఆమె పరుగెత్తి, అందరూ చూస్తూండగానే బ్రిడ్జిపై నుంచి కాలువలోకి దూకేసి, ప్రవాహంలో గల్లంతైంది. దీనిపై ఆమె భర్త శ్రీనివాసరావు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశామని ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. కస్తూరి ఆచూకీ కోసం కాలువలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement