డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం

Women refuses a man to marry for not having degree - Sakshi

వైరా రూరల్‌: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్‌ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్‌తో వివాహం కుదిరింది.

ఇక్బాల్‌ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేయగా ఇక్బాల్‌ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు తెలిసింది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్‌పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top