breaking news
vyra mandal
-
డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం
వైరా రూరల్: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్తో వివాహం కుదిరింది. ఇక్బాల్ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేయగా ఇక్బాల్ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు తెలిసింది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. -
కన్నీటి నడుమ కల్యాణం
విషాదం అప్పటిదాకా కళకళలాడిన ఆ ఇల్లు....అంతలోనే కళావిహీనంగా మారింది.అందరి ఆనందం.. క్షణాల్లో ఆవిరైంది.మంగళవారుుద్యాలుమూగబోయూరుు.. రోదనలు మిన్నంటారుు.వైరా మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వివాహ వేడుక జరగాల్సిన ఓ ఇంట కొన్ని గంటలపాటు నెలకొన్న దృశ్యమిది. వైరా/తల్లాడ: వైరా మండలం స్టేజి పినపాక వద్ద శుక్రవారం రాత్రి ఘోరం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెం దారు. మరో 28మందికి గాయూలయ్యూరుు. బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్కు, తలా ్లడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి11:30 గంటలకు వరుడి ఇంటిలో వివాహం జరగాల్సుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకని వధువు స్వగ్రామమైన మంగాపురం నుంచి ఆమె బంధువులు, సన్నిహితులు ట్రాక్టర్ ట్రక్కులో బయల్దేరారు. మరో పది నిమిషాల ప్రయూణం తరువాత వారంతా పెళ్లింటికి చేరుకునేవారు. వైరా మండలం స్టేజి పినపాక హైలెవల్ వంతెన వద్ద వీరి ట్రాక్టర్ ట్రక్కును వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ట్రక్కులోని వారంతా ఒక్కసారిగా వంతెన పైనుంచి కింద పడిపోయూరు. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె దగ్గరి బంధువులు గాదె లీలావతి(35), గాదె రమాదేవి(37) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో బంధువు పుప్పాల పద్మావతి(34) ఆస్పత్రిలో శనివారం మృతిచెందింది. 28 మందికి గాయూలు ఏం జరిగిందో తెలియని స్థితిలో ట్రక్కులోని వారంతా హాహాకారాలు చేశారు. చెట్లు, పొదలతో కూడిన బ్రిడ్జి కింద భాగం(లోయ)లో వీరంతా పడిపోయూరు. మొత్తం 28మందికి గాయూల య్యూరుు. వీరంతా ఖమ్మంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మంగాపురం గ్రామస్తులు పరుచూరి మల్లమ్మ (వధువు నానమ్మ), పరుచూరి అప్పారావు, పరుచూరి చిన్న రెడ్డెయ్య, పద్మ, శ్రీలత, గాదె కృష్ణకుమారి, శైలజ, సునీత, లీలావతి, కుప్పాల శ్రీలత, తుటారి చిన్న లక్ష్మీనరసమ్మ, పరుచూరి రామారావు, మల్లెశెట్టి మమత, కటకి శ్రీలక్ష్మి, తుటారి విజయ, ఉమామహేశ్వర్రావు, మహాలక్ష్మి, కుంచం సుబ్బారావు, రమాదేవి, వెంకమ్మ, పరుచూరి సామ్రాజ్యం, నాగేశ్వర్రావు, మల్లవరం గ్రామస్తులు దుగ్గిదేవర సైదులు, నరసింహారావ, సారపాక గ్రామస్తు డు అభి ఉన్నారు. ఇదే వేడుకకు హాజరయ్యేం దుకని ద్విచక్ర వాహనంపై వస్తున్న తల్లాడ మండలం నారాయణపురం గ్రామస్తుడు వల్లాపురం రాంబాబుకు తీవ్ర గాయూలయ్యూరుు. ఇతని పరిస్థితి విషమంగాఉంది. ఇతని వాహనం ట్రాక్టర్ వెనుకగా వస్తోంది. ప్రమాద స్థలంలో ట్రాక్టర్ను ఇతని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇతని పరిస్థితి విషమంగా ఉంది. స్తంభించిన ట్రాఫిక్ ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిం ది. వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, క్షతగాత్రులను బయటకు తీరుుంచారు. 108 వాహనాల రాక ఆలస్యమవడంతో ద్విచక్ర వాహనాలపై, ఆటోల్లో క్షతగ్రాతులను వైరాలోని ప్రైవేట్ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి పోలీసు లు తరలించి, కేసు నమోదు చేశారు. కన్నీటిసంద్రంగా మంగాపురం.. ఈ ప్రమాదంతో మంగాపురం గ్రామం కన్నీటిసంద్రంగా మారింది. ఈ ప్రమాదంలో ఇదే గ్రా మానికి చెందిన సమీప బంధువులైన ముగ్గురు మృతిచెందారు. అనేకమందికి తీవ్ర గాయూల య్యూరుు. పోస్టుమార్టం అనంతరం శనివారం మంగాపురం తీసుకొచ్చిన మృతదేహాలను చూ సి కుటుంబీకులు, బంధువులు పెద్దపెట్టున రోదించారు. కన్నీటి నడుమ కల్యాణం ఈ ప్రమాద విషయం తెలిసేప్పటికి పెళ్లి ముహూర్తం సమీపించింది. దీంతో, ఒకవైపు రోదనలు మిన్నంటుతుండగానే వివాహాన్ని కొనసాగించారు. -
పెళ్లింట పెనువిషాదం
ఇద్దరి దుర్మరణం - 35 మందికి గాయాలు ఐదుగురి పరిస్థితి ఆందోళనకరం వైరా/తల్లాడ : వైరా మండలం పినపాక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైరాలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్కు తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి 11.30గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో మంగాపురం నుంచి ట్రాక్టర్లో పెళ్లి కుమార్తె బంధువులు, గ్రామస్తులు బయల్దేరారు. వైరా మండలం పినపాక హైలెవల్ వంతెన వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రక్కును వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్లో ఉన్న పెళ్లి బృందం బ్రిడ్జి కింద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వధువు మేనత్త గాదె లీలావతి(40), గాదె రమాదేవి(35) మృతిచెందారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పద్మ, టి.రమాదేవి, వి.లక్ష్మీనరసమ్మ, కె.సుబ్బారావు, పి.అప్పారావు, వెంకమ్మ, పరుచూరి పద్మ, పరుచూరి సామ్రాజ్యం సహా 35మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా ట్రాక్టర్ వెనుక ద్విచక్రవాహనంపై అదే పెళ్లికి హాజరయ్యేం దుకు వస్తున్న వి.రాంబాబు(35) ట్రాక్టర్ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి ట్రాక్టర్- లారీ ఢీ; ఇద్దరు మృతి
ఖమ్మం: జిల్లాలో వైరాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 10మందికి గాయాలయ్యాయి. పెళ్లికి వెళుతున్న ట్రాక్టర్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.