ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి..  నగదు పోగొట్టుకున్న యువతి  | Woman Booked Mobile In Online, Lost 23 Thousands In Balanagar | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి..  నగదు పోగొట్టుకున్న యువతి 

Nov 6 2021 2:59 PM | Updated on Nov 6 2021 3:06 PM

Woman Booked Mobile In Online, Lost 23 Thousands In Balanagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వ్యక్తి చెప్పినట్లుగా  5 రూపాయలు పంపించింది. ఆమెకు ఓటీపీ వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఆమె అకౌంట్‌ నుంచి 23,154 రూపాయల నగదు డెబిట్‌ అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా

సాక్షి, బాలానగర్‌: ఆన్‌లైన్‌లో ఫోన్‌ను బుక్‌ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. బాలానగర్‌ డివిజన్‌ ఫిరోజ్‌గూడకు చెందిన మౌనిక (24) ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి నగదు చెల్లించింది. కాగా ఆ నగదు జమ అయినట్లుగా ఫోన్‌కు సమాచారం రాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ గురించి సెర్చ్‌ చేస్తుండగా గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది.
చదవండి: కూకట్‌పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు

మెబిక్విక్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ వ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసి అందులో నుంచి 5 రూపాయలు పంపిస్తే మీరు నగదు చెల్లించినట్లుగా మెసేజ్‌ వస్తుందని చెప్పారు. ఆమె గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగా  5 రూపాయలు పంపించింది. ఆమెకు ఓటీపీ వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఆమె అకౌంట్‌ నుంచి 23,154 రూపాయల నగదు డెబిట్‌ అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా పని చేయడం లేదు. దీంతో మౌనిక బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ వాహిదుద్దీన్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement