మరణంలోనూ వీడని బంధం 

Wife Lost Breath 10 Minutes After Husband Demise Tamil Nadu - Sakshi

భర్త కన్నుమూసిన కాసేపటికే భార్య మృతి

వేలూరు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. వానియంబాడి తాలుకా కచ్చేరి రోడ్డుకు చెందిన అన్నామలై(78), లక్ష్మమ్మాల్‌(65) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అన్నామలై వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. శుక్రవారం అన్నామలై గుండె పోటుతో  మృతి చెందారు. అన్నామలై మృతదేహంపై రోదిస్తూ లక్ష్మమ్మాల్‌ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అన్నామలై మృతి చెందిన పది నిమిషాల్లోనే లక్ష్మమ్మాల్‌ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేసింది.  

వివాహిత ఆత్మహత్య 
టీ.నగర్‌: కరోనాతో భర్త మృతి చెందడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చెన్నైలో జరిగింది. ఐనావరానికి చెందిన రాజ్‌కుమార్‌(45) భార్య కల్పన (36). వీరి రెండేళ్ల కుమార్తె 2016లో అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా వైరస్‌ సోకి ఈ నెల 26న రాజ్‌కుమార్‌ మృతిచెందారు. కుమార్తె, భర్త మృతిని కల్పన తట్టుకోలేకపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది. ఐనావరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కల్పన తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

చదవండి: మైనర్‌ విద్యార్ధినితో ప్రేమ.. పెద్దలు ఒప్పుకోలేదని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top