Errabelli Dayakar Rao: కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌.. వాహనంలోనే ఆస్పత్రికి తరలింపు

Two Wheeler Hit To Minister Errabelli Dayakar Rao Convoy In Yadadri District - Sakshi

సాక్షి, యాదాద్రి: తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. యాదాద్రి కలెక్టరేట్ సమీపంలో మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాల‍య్యాయి. గాయపడిన వారిని మంత్రి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆస్పత్రికి తరలించారు. గతంలో​ ఎర్రబెల్లి దయాకర్‌ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

చదవండి: అంత్యక్రియలు అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top