Locals Stopped Final Rituals of a Man in Vemsoor Khammam - Sakshi
Sakshi News home page

Final Funeral Khammam అంత్యక్రియలు అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

Sep 24 2021 9:09 AM | Updated on Sep 24 2021 11:27 AM

Final Funeral Stopped Locals In Vemsoor Khammam - Sakshi

వేంసూరులో చితిపై కూర్చున్న స్థానికుడు

ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియల కోసం మృతదేహం తీసుకెళ్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. మరింత రెచ్చిపోయి చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

వేంసూరు (ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని వేంసూరులో అమానుష సంఘటన జరిగింది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించవద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అయితే మరీ చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన దౌర్భాగ్య పరిస్థితి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కాలనీలో అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దికాలంగా కాలనీ సమీపాన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ తర్వాత మరోచోట ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

అయినా గురువారం ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహానికి కాలనీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. అయితే కాలనీవాసులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ మృతదేహాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు మృతుడి బంధువులు నచ్చచెప్పగా, దహన సంస్కారాలకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం

Advertisement
 
Advertisement
Advertisement