ప్రేమించలేదని బాలిక‌ గొంతు‌ కోసేశాడు

Telangana: Man Strangled Girl For Not Loving Him - Sakshi

సాక్షి, సూర్యాపేట: ప్రేమించలేదని ఓ దుండగుడు బాలిక గొంత కోసిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నేరెడుచర్లలో ఓ బాలికతో తనను ప్రేమిస్తున్నట్లు బాల సైదులు అనే వ్యక్తి తెలిపాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో గత కొంత కాలంగా  ప్రేమ పేరుతో తనని వేధిస్తూ వచ్చాడు. ఎంతకీ తాను ఒప్పుకోలేదనే కోపంతో బాలిక గొంతు కోసేశాడు. ఈ ఘటన అరబిందో కాలేజ్‌ సమీపంలో జరిగింది. దాడిలో బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top