నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనాకు బలి

Teacher Deceased Of Covid 19 Ahead Marriage In Sangareddy - Sakshi

నారాయణఖేడ్‌: నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు కోవిడ్‌కు బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలంలోని మన్యానాయక్‌ తండాలో జరిగింది. కర్ర గణపతి చౌహాన్‌ (28) మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరగగా, మే 2న వివాహం జరగాల్సి ఉంది. కాగా, వారం కింద కరోనా లక్షణా లున్నాయని పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

చదవండి: విషాదం: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్‌.. అంతలోనే 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top