చోరికి ప్రయత్నించి.. అర్చకులకు అడ్డంగా దొరికిపోయాడు

సాక్షి, విజయవాడ: ఆలయంలో చోరికి యత్నించిన దుండగుడు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. గన్నవరంలోని శ్రీవెంకటేశ్వరంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు హుండీ పగలగొడుతుండగా అర్చకులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని గుడి స్తంభానికి కట్టేసిన అర్చకులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన వ్యక్తి ఉంగటూరు మండలం తేలప్రోలుకు చెందిన నరేంద్రగా గుర్తించారు. చదవండి: ('నన్ను వెతకకండి.. నేను చనిపోతున్నా..’)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి