కలలు కల్లలు.. ఉద్యోగంలో చేరిన గంటల్లోనే... | Road Accident Woman Dies In Krishna District | Sakshi
Sakshi News home page

కలలు కల్లలు.. ఉద్యోగంలో చేరిన గంటల్లోనే...

Oct 17 2021 4:38 AM | Updated on Oct 17 2021 7:38 AM

Road Accident Woman Dies In Krishna District - Sakshi

మృతి చెందిన  కాల్వ సావిత్రి  

దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

నందిగామ: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి (33)తో వివాహమైంది. వారు పరిటాలలోనే నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో అసిస్టెంట్‌ లైన్‌ ఉమెన్‌గా సావిత్రికి ఉద్యోగం వచ్చింది.

దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నందిగామ పట్టణ శివారుల్లో 65వ నంబరు జాతీయ రహదారిపై బైక్‌ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన మారుతీరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  
(చదవండి: ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement